05-01-2026 11:25:27 AM
వాషింగ్టన్లో కారు ప్రమాదం.
పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి.
అమెరికాలో ఇంజినీర్గా పని చేస్తున్న కృష్ణ కిషోర్.
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు(Telugu couple) దుర్మరణం పాలయ్యారు. విషాదకరమైన వార్తల్లోకి వెళితే, తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మద్యం తాగి తప్పుడు దిశలో వస్తున్న డ్రైవర్ వారి వాహనాన్ని ట్రక్కుతో ఢీకొట్టడంతో షార్లెట్ నివాసితులు కృష్ణ కిషోర్, అతని కుటుంబం ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కృష్ణ కిషోర్, అతని భార్య ఆశ తీవ్ర గాయాలపాలై మరణించారు.
వారి మృతదేహాలను మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న సమీపంలోని తెలుగు ప్రజలు ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. కృష్ణ, ఆమృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఒక అపార్ట్మెంట్లో భారతీయ యువ ఆరోగ్య సంరక్షణ నిపుణురాలు కత్తిపోట్లకు గురై మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఆమె మాజీ ప్రియుడి కోసం అంతర్జాతీయంగా గాలింపు చర్యలు చేపట్టారు.