27-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ టౌన్ ఆగస్టు 26(విజయ క్రాంతి): కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయం అని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 60వ డివిజన్ లోని ఎస్బిహెచ్ కాలనీలో మరియు మసీద్ లైన్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టారు.
నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు ప్రజా రవాణాకు అందుబాటులో ఉంచా లని ఆదేశించారు. నాణ్యత పరమైన ప్రమాణాలను పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్,మాజీ కార్పొరేటర్ నాగరాజు,డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్ మరియు నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.