calender_icon.png 27 August, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లు రోల్ మోడల్‌గా ఉండాలి

27-08-2025 12:00:00 AM

 కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, వారంతా విద్యార్థులకు, సమాజానికి రోల్ మోడల్గా ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతారం మోడల్ స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి  టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్‌ఎం) ప్రదర్శనను పరిశీలించారు.

మేళాలో 18 మండలాల నుండి తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్ లో దాదాపు 180 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. జిల్లా స్థాయిలో పాల్గొన్న ఎగ్జిబిట్లలో ఉత్తమమైన 8 టిఎల్‌ఎం లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఏ ఎం ఓ ఆజాద్,  ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.