14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

సేవా కార్యక్రమాలే మైత్రి ఫౌండేషన్ లక్ష్యం

23-12-2025 12:00 AM

* సామూహిక శ్రీమంతాలతో ఆరవ వార్షికోత్సవం

* ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి ఉదయ్ కుమార్ 

గుమ్మడిదల, డిసెంబర్ 22 : నిరుపేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే మైత్రి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్కుమార్ తెలిపారు. సంస్థ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ ఉమాదేవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉదయ్కుమార్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా గుమ్మడిదల మండలం పరిసర ప్రాంతాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఉచిత అంబులెన్స్ సేవలు, బ్లడ్ డొనేషన్, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మానస్విని, హెచ్‌ఈఓ శ్రీనివాస్, అతిథులు చంద్రిక, సుస్మిత, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.