calender_icon.png 10 July, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపై చర్చించేందుకే అసెంబ్లీ

10-07-2025 12:00:00 AM

కేటీఆర్‌కు అవగాహన లేదు: ఎమ్మెల్సీ శంకర్ నాయక్  

 నల్లగొండ టౌన్, జూలై 9 : ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ ఉందని  దమ్ముంటే కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిసిసి అధ్యక్షులు   ఎమ్మెల్సీ శంకర్ నాయక్  అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని తిని అధికారం కోల్పోయిన తర్వాత  కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దండుకు తిన్నారని కాలేశ్వరం కూలేశ్వరం అయిందని దుయ్యపట్టారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా వివక్షత చూపారని ఆంధ్రకు నీళ్లు ఇవ్వడానికి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.బనకచర్ల, కృష్ణ జలాలపై మాట్లాడాల్సింది అసెంబ్లీలో ప్రెస్ క్లబ్ లో కాదన్నారు.

కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని బీఆర్‌ఎస్ హయంలో ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి అన్ని లీకేజీలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. మతి భ్రమించి మాట్లాడుతున్న కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చూయించుకోవాలని త్వరలో తెలంగాణలో బిఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయమన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జూకూరి రమేష్, నల్లగొండ మండల మాజీ జెడ్పిటిసి  వంగూరు లక్ష్మయ్య, నాయకులు కత్తుల కోటి, తదితరులు పాల్గొన్నారు.