03-11-2025 01:55:58 AM
							కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధన సభ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 10 న నిర్వహిస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా స్థాయి బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సమావేశానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజులు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు.