17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వికలాంగుల జీవనోపాధిపై కేంద్రం కుట్ర

22-12-2025 12:06 AM

* కేంద్రం తెచ్చిన విబి-జి రామ్ జి బిల్లు రద్దు చేయాలి 

* మెదక్ లో బిల్లు ప్రతులు దగ్ధం

మెదక్,డిసెంబర్ 21 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు 2025 వికలాంగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య హెచ్చ రించారు. ఆదివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబి-జి రామ్ జిబిల్లు పత్రాలను దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం, భూమిలేని, పేదరికంలో ఉన్న వికలాంగులకు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి కల్పించెందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందని అన్నారు. నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వ్యవస్థలు మరియు పని ప్రదేశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన వికలాంగులలో పని చేసే వారి సంఖ్య తగ్గితుందని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ పథకం కింద ఉపాధి కల్పించబడిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగ కార్మికులకు జీవనోపాధిని మరింతగా కోల్పోయేలా చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగుల ను తీవ్రమైన పేదరికంలోకి నేడుతుందని అన్నారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కె.మల్లేశం, జిల్లా కార్యదర్శి కె.యశోద, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, కె.కవిత, గుమ్మడిదల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు కిష్టయ్య, శ్రీనివాస్, మెదక్ పట్టణ అధ్యక్షులు శ్రీదేవి, కార్యదర్శి మున్నా, ఉపాధ్యక్షులు వెంకట్ నాయకులు సభనా, ఊసుఫోద్దీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.