17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో చెక్కు అందజేత

17-01-2026 03:21 AM

టేకులపల్లి, జనవరి 16, (విజయక్రాంతి): టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభకు జిల్లా కుటుంబ సంక్షేమ నిధి సొసైటీ కన్వీనర్ డి.దాసు అధ్యక్షత వ హించారు. ముఖ్య అతిథిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభ వాని హాజరై మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తం గా మరణించిన టీఎస్ యూటీఎఫ్ కుటుం బ సంక్షేమ సొసైటీ సభ్యులకు రూ.3 కోట్లకు పైగా సంఘీభావ విరాళాలు అందజేయడం జరిగిందని తెలిపారు.