calender_icon.png 17 January, 2026 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో చెక్కు అందజేత

17-01-2026 03:21:19 AM

టేకులపల్లి, జనవరి 16, (విజయక్రాంతి): టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభకు జిల్లా కుటుంబ సంక్షేమ నిధి సొసైటీ కన్వీనర్ డి.దాసు అధ్యక్షత వ హించారు. ముఖ్య అతిథిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభ వాని హాజరై మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తం గా మరణించిన టీఎస్ యూటీఎఫ్ కుటుం బ సంక్షేమ సొసైటీ సభ్యులకు రూ.3 కోట్లకు పైగా సంఘీభావ విరాళాలు అందజేయడం జరిగిందని తెలిపారు.