17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అసంఘటిత కార్మికులకు అండ సీపీఐనే..

17-12-2025 12:00 AM
  1. కార్మికులు అనుభవించే ప్రతిహక్కు ఏఐటీయూసీ పోరాట ఫలితమే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని 

కొత్తగూడెం, డిసెంబర్ 16, (విజయక్రాంతి):సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులను పరిరక్షిస్తూ, నూతన హక్కులను సాధించిపెడుతుంది ఎర్ర జెండానేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’లో మంగళవారం జరిగిన కొత్తగూడెం డివిజన్ హమాలీ కార్మికుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు.  కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు, సౌకర్యం వెనుక ఏఐటీయూసీ, సిపిఐ పోరాటం ఉందని, పోరాటాలు సాగిస్తేనే హక్కులు ఏర్పడతాయని అన్నారు.

హక్కుల సాధనకు, పరిరక్షణకు ఎర్ర జెండాపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గరీబ్ పేట, హేమచంద్రాపురం తదితర పంచాయతీల్లో హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంన్నారని, విజ్ఞతతో అలోచించి ప్రజలు, కార్మికులకు పోరాడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. సమావేశం సందర్బంగా రామాంజనేయ కాలనీ సర్పంచి, 12మంది వార్డు సభ్యులు కూనంనేనిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో సత్కరించారు.