20 June, 2026 | 4:10 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎంపీడీవోలు

28-10-2025 07:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్షలో అర్హత సాధించి, ఇటీవల జిల్లాలోని నాలుగు మండలాలకు కేటాయించబడిన నలుగురు ఎంపీడీవోలు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను సోమవారం రాత్రి, వారి కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీడీవో విధులు, బాధ్యతలు గురించి వివరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న పథకాలన్నీ అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కష్టపడి పని చేస్తూ, విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఉద్యోగ జీవితంలో భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.