23 June, 2026 | 7:58 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

నెరవేరిన సొంతింటి కల

14-11-2025 12:06 AM

తొలి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం

మహబూబాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): నిలువ నీడలేని నిరుపేదలకు సొంతింటి కల సాకారమవుతోంది. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్మిం చిన తొలి ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం గురువారం నిర్వహించారు. మహ బూబాబాద్ మండలం నడివాడ గ్రామ శివారు రంగసాయిపేటలో పన్నాల ఉపేంద్ర బిక్షమయ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆధ్వర్యంలో గృహప్రవేశం చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన గృహప్రవేశం నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నిలువ నీడ లేని పేదలకు గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు క ట్టుబడి ఇందిరమ్మ పథకంలో నిరుపేదలకు 5 లక్షల రూపాయల వ్యయంతో పక్కా గృహాన్ని కట్టించి ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభు త్వం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. దశలవారీగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నిలువ నీడలేని పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 

మొదటి విడత 3,500 ఇందిరమ్మ ఇండ్లకు తోడు అదనంగా 1000 మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సురే ష్ నాయక్, మిట్ట కంటి రాంరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.