16 April, 2026 | 9:42 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఇందిరమ్మ రాజ్యంలోనే సొంతింటి కల సాకారం

10-11-2025 12:27 AM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా 

ఎల్లారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఇండ్లు లేక పూరిగుడిసెల్లో నివాసం గడిపారని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అరులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా అన్నారు. ఆదివారం ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మాణం   చేసుకుంటున్న ఇంటిని నేరుగా మండల కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు కురుమ సాయిబాబా పరిశీలించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నా నిర్వాహకులు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో పాత్రికేయుని కుమారుని కేశఖండనం కార్యక్రమంలో పాల్గొని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, సిద్దు, చూడ సంజీవులు, తదితరులు పాల్గొన్నారు.