15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భారీ నీటి బిల్లులను రద్దు చేయాలి

28-12-2025 12:00 AM
  1. మున్సిపాలిటీలపై జలమండలి వివక్ష
  2. ఉచిత నీటి పథకం వర్తింపజేయాలని డిమాండ్
  3. అధికారులను కలిసిన బీజేపీ నాయకులు

మణికొండ, డిసెంబర్ 27, (విజయక్రాంతి): నార్సింగి సర్కిల్ పరిధిలోని మణి కొండ, నెక్నాంపూర్, గండిపేట, కోకాపేట డివిజన్లలో జలమండలి జారీ చేసిన భారీ నీటి బిల్లులను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. అంజన్ కుమార్ గౌడ్, మణికొండ మాజీ వైస్ చైర్మన్ కొండకళ్ల నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నార్సింగి సర్కిల్ జలమండలి డీజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం మహేష్, మేనేజర్ రామకృష్ణారెడ్డిలను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 సెప్టెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు సుమా రు 56 నెలల బిల్లులను ఒకేసారి జారీ చేయడం ప్రజలపై పెనుభారం మోపడమేనని మండిపడ్డారు.

ఒక్కో వినియోగదా రునికి 70 వేల నుండి 90 వేల రూపాయల వరకు బిల్లులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలవుతున్న 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలకు ఎందుకు వర్తింపజేయడం లేదని అధికారులను నిలదీశారు. పాత నగరానికి ఒక న్యాయం, మున్సిపాలిటీలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

విచక్షణారహితంగా పంపిణీ చేసిన ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉచిత నీటి పథకాన్ని ఈ డివిజన్లలోనూ అమలు చేస్తూ కొత్త బిల్లులు జారీ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి. లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, నాగేష్, రవికాంత్ రెడ్డి, చిలుకూరి బీరప్ప, బిక్షపతి యాదవ్, శివరాజ్, గణేష్, సిద్ధప్ప, రాజేష్, భీమ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, వేణు, శివరాజ్ చారి పాల్గొన్నారు.