06-07-2025 05:51:12 PM
భారత్ vs ఇంగ్లాండ్: బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్(Edgbaston)లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ 5వ రోజు ఆట వర్షం కారణంగా దాదాపు రెండు గంటల సమయం తర్వాత ప్రారంభమయింది. శుభ్మన్ గిల్(Shubman Gill) నేతృత్వంలోని టీమిండియా తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేయడానికి ఇంకా ఐదు వికెట్లు అవసరం ఉంది. వర్షం కారణంగా 5వ రోజు ఆటను అంపైర్లు 80 ఓవర్లకు కుదించారు. కాగా, తొలి సెషన్ ఆరంభంలోనే ఆకాశ్ దీప్(Akash Deep) ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. అతను వేసిన 19.1 ఓవర్ కు ఓలీ పొప్(24) బౌల్డ్ అవ్వగా, 21.3 ఓవర్ కు హ్యారీ బ్రూక్(23) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంగ్లాండ్ 22 ఓవర్లకు 87/5కి చేరుకుంది. బెన్ స్టోక్స్(3) మరియు జేమీ స్మిత్(4) క్రీజులో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేస్తుంది.