12 May, 2026 | 10:56 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

జీవో 49 రద్దు కోసం పోరాటం

26-07-2025 04:44 PM

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు జారీ చేసిన జీవో 49 ను తాత్కాలిక నిలుపుదల కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్(CPM State Committee Members Bhopal) డిమాండ్ చేశారు. శనివారం కాగజ్ నగర్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 339 గ్రామాలు, మూడు లక్షల 65 వేల ఎకరాల పంట భూములు, నీటి వనరులు, నివాసాలు, హక్కులను కోల్పోతుండడంతో ప్రజలు చేసిన పోరాటానికి ప్రభుత్వం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేయడం సిపిఎం స్వాగతిస్తుందని అన్నారు. జీవో పూర్తిస్థాయి రద్దు కోసం ఈనెల 28 కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని ఆదివాసీలు దళితులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. జీవో పూర్తి స్థాయిలో రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజన్న, నియోజకవర్గం కన్వీనర్ ఆనంద్ కుమార్, కమిటీ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.