06-07-2025 07:21:57 PM
కోదాడ: పట్టణంలోని విష్ణుబోట్ల హరి ప్రసాద్ శర్మ నివాసంలో త్రిశక్తి శాంభవి పీఠం వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోదాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సుభిక్షంగా పాడిపంటలతో అందరూ ఈ తొలి ఏకాదశి పండుగకు పిల్లల నూతన విద్యాభ్యాసం మంచిగా సాగి, అందరు కూడా ప్రశాంతంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు కుటుంబ సభ్యులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.