7 March, 2026 | 2:10 AM

ఆలయ పనులను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్సీ

27-12-2025 01:56 AM

కోటపల్లి(చెన్నూర్), డిసెంబర్ 26: చెన్నూర్ నియోజక వర్గంలోని కోటపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామ, శివాలయ గుడి నిర్మాణ పనులను శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ పరిశీలించారు.

గుత్తేదారును నాణ్యతతో పనులు నిర్మించాలని, ఏ విషయంలోనూ వెనుకాడవద్దన్నారు. గుడిలోకి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అం దుబాటులో ఉండేలా నిర్మాణ పనులు జరుగాలన్నారు. మాజీ ఎంఎల్సీ వెంట కోటపల్లి సర్పంచ్ ఆలూరు సంపత్, బెల్లంపల్లి మల్లయ్య, గ్రామస్తులు ఉన్నారు.