17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

04-11-2025 12:47 AM

సోయా, మక్క కొనుగోలు కేంద్రలను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

ఆదిలాబాద్, నవంబర్ ౩ (విజయక్రాంతి): అకాల వర్షాలతో తడిసిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ నియోజకవర్గ ప్రజల ప్రధాన పంటలైన పత్తి, సోయా, మొక్క జొన్న, శనగ, వేరు శనగ పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు. సోమవారం నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, తాంసి, భీంపూర్, మండల కేంద్రలలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా బిన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. చాలా మంది రైతుల వద్ద సెల్ ఫోన్లు లేవనీ,  ఉన్న నెట్వర్కులు లేవు కావున ఈ ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా రైతులు ఎవరుకూడా దళారులకు పంట అమ్మి మోసపోవద్దు అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.