14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

30-10-2025 04:34 PM

క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయాలి, నష్ట పరిహారం చెల్లించాలి 

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి  కొయ్యడ సృజన్ కుమార్

ముకరంపురా (విజయక్రాంతి): మొంథా తుపాన్ తో కురిసిన భారీ వర్షాల వల్ల నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆడుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరగాళం కష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మెంతా తుపాన్ తో వరి ధాన్యం, పత్తి పంట నేలమట్టం అయ్యిందని, కళ్ళల్లో వడ్లు తడిసయాని, పత్తి నీటితో తడిసి ముద్ద అయ్యిందని,రైతులకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి రెవిన్యూ, వ్యవసాయ అధికారులతో క్షేత్ర స్థాయిలో పంట నష్టం పై అంచనా వేసి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, తడిసిన ధన్యాన్ని, పత్తి ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు ప్రభుత్వం స్పందించి రైతులను ఆడుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పండించిన పంటలకు చేసిన అప్పులు కట్టలేక ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని వెంటనే ప్రభుత్వ అధికారులు పంట నష్టంపై అంచనాలు వేసి వారికీ భరోసా కల్పించాలని సృజన్ కుమార్ కోరారు.