17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

22-04-2025 01:14 AM

 వైరా,  ఏప్రిల్ 21: వైరా పట్టణం, వైరా రూరల్ ప్రాంతాల్లో వీచిన బలమైన గాలి దుమ్ము, అకాల వర్షంతో వరి ధాన్యం, మొక్కజొన్న, మిర్చి తడిసిపోయి రైతు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారంతో పాటు తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం ఉదయం వైరా వ్యవసాయ మార్కెట్లో తడిసిన వరి ధాన్యాన్ని సిపిఎం నేతలతో కలిసి వారు పరిశీలించారు. రైతులకు ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక రైతులు ఆకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే కోనుగోలు కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే సామాగ్రిని అందుబాటులో ఉంచాలని అధికారులకు కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు చేయాలని కోరారు.

 వ్యవసాయ మార్కెట్ లో తడిసిన ధాన్యం పరిశీలనలో ఆయనతోపాటు సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, పట్టణ నాయకులు సంక్రాంతి పురుషోత్తమరావు, కామినేని రవి, షేక్ నాగుల్ పాషా, గుమ్మా నరసింహారావు, నారికొండ అమరేందర్, విప్పలమడక మాజీ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మేడా శరాబంది, అమరనేని కృష్ణ, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.