15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి

30-12-2025 01:28 AM

మాజీ సర్పంచుల అరెస్ట్ 

జహీరాబాద్, డిసెంబరు 28 : జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ స ర్పంచులు అసెంబ్లీ ముట్టడికి బ యలుదేరారు. జహీరాబాద్ ని యోజకవర్గంలో గతంలో ప్రజా ప్రతినిధులు చేపట్టిన పనుల బిల్లులు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు కొట్టుమిట్టాడుతున్నారు.

జహీరాబాద్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు తమ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేపట్టిన బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లుల గురించి తమను రెండు సంవత్సరాల కాలంలో పది సార్లు అక్రమ అరెస్టు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిడిగి మాజీ సర్పంచ్ కరణ్ రాజ్, రాయిపల్లి డి మాజీ సర్పంచ్ విజయ్ లను అరెస్టు చేశారు.