17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పీఎంఈజీపీ పథకం పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం

25-12-2025 12:41 AM

జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని జ్యోతి

వనపర్తి క్రైమ్, డిసెంబర్ 24 : కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న పీఎంఈజిపి పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని జ్యోతి తెలిపారు  ఎoట్రపరెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్ వనపర్తి మరియు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఐకెపి నాగాపూర్, రేవల్లి మండలంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్కీం పై ఎంతో చక్కటి అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి  మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న పీఎం ఈజిపి స్కీం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎంత శాతం సబ్సిడీ వస్తుంది ఏ ఏ రంగాల వారు దీనికి అర్హులు అనే అంశాలపై వివరించారు. అలాగే పీఎంఈజీపి దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదిస్తే వారి సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ నూర్, ఐపిఓ నాగేష్, ఇడిసి మేనేజర్ శ్రీకాంత్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.