26 March, 2026 | 2:52 AM

గిరిజన, బంజారా నాయకుల ముందస్తు అరెస్టులు హేయమైన చర్య

26-03-2026 12:05 AM

కోటియా నాయక్

కోదాడ, మార్చి 25 : గిరిజన, బంజారా నాయకుల ముందస్తు అరెస్టులు హేయమైన చర్య అని లంబాడి హక్కుల పోరాట సమితి , ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్యా కోట్యా నాయక్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పెండింగ్లో ఉన్న సబ్సిడీ నిధుల విడుడలకు హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ భవన్ ముట్టడికి  పిలుపునిచ్చిన గిరిజన సంఘాల జేఏసీ నాయకుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల ప్రకారం అనేక సంక్షేమ పథకాలను మాకు చేరే విధంగా చర్య తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహావిష్కరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.  జిల్లా నాయకులు భూక్యా రవినాయక్ ను ముందస్తు అరెస్టు చేసి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని ఖండించారు.