స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి విద్యా సామగ్రి పంపిణీ
16-06-2026 01:51 AM
కల్లూరు, జూన్ 15 (విజయక్రాంతి): స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్లూరు మండల విద్యాశాఖ కార్యాలయం లో విద్యా ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 14 కుర్చీలు, 300 నోట్బుక్స్ను ఎంఈఓ నివేదితకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ కల్లూరు కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, చింతలపూడి కృష్ణ, ఎస్.కే. ముజీబ్ పాల్గొన్నారు. అలాగే సహాయకులుగా ఉబ్బన వేణుబాబు, మర్రేల వెంకటేశ్వరావు, ఇందూరి దేవేందర్ సహకారం అందించారు. ఈ సందర్భంగా కుర్చీలు, నోట్బుక్స్ అందించినందుకు ఎంఈఓ నివేదిత ఫౌండేషన్ చైర్మన్తో పాటు దాతలు,ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






