17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

28-05-2025 12:21 AM
  1. ముఖ్యమంత్రికి లేఖ విడుదల

టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ల అమలును జూన్ 2 లోపు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(టీయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో హామీలు అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ విడుదల చేసి మాట్లాడారు.

గత 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, 6 గ్యారెంటీల హామీలలో హామీ పొందుపరిచారని గుర్తుచేశారు. ఆ ఎన్నికలలో తెలం గాణ ఉద్యమకారుల ఫోరం, ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమికను పోషించారని అన్నారు. సంక్షేమ పథకాలలో, ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాసం లలో 20 శాతం కోటా ఉద్యమకారులకు కేటాయించాలన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పా టు చేసి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కే టాయించాలని కోరారు. తెలంగాణ సాం స్కృతిక విభాగంలో వెయ్యి ఉద్యోగాలు కల్పించి తెలంగాణ ఉద్యమ కళాకారులకి కేటాయించాలని కోరారు.

ఈ సమావేశం లో ఫోరం ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు దయా నంద్, కొండ స్వామి, గగన్ కుమార్, వీరస్వామి, కొంతం యాదిరెడ్డి, జగన్ యాదవ్, సుదర్శన్ రావు, ఆర్.కే. భూపాల్, సుదర్శన్, శివ కుమార్ నేత, విష్ణువర్ధన్, శ్యామల, ప్రభు గుప్తా, రామ్ బాబు, నరేందర్ గౌడ్, చంద్ర శేఖర్, లక్ష్మణ్, గౌస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.