26 March, 2026 | 12:08 PM

Breaking News

మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •   ఎంతమందిని తొక్కుతవ్!   •  

మున్సిపల్ ఎన్నికలవేళ.. ముదిరిన ప్రొటోకాల్ రగడ

22-01-2026 01:19 AM
  1. అలంపూర్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్

సీసీ రోడ్డు శంకుస్థాపనకు టెంకాయ కొట్టే విషయంలో గొడవ 

ఎంపీ తీరుపై మండిపడుతున్న బీఆర్‌ఎస్ శ్రేణులు 

అదే కోవలో ఎమ్మెల్యే తీరుపట్ల మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు

అలంపూర్, జనవరి 21:రానున్న మున్సిపల్ ఎన్నికలవేళ అలంపూర్ రాజకీయాలలో సోమవారం జరిగిన ప్రోటోకాల్ వివాదం జిల్లా వ్యాప్తంగా దుమారం రేపుతుంది. భూమి పూజకు టెంకాయలు కొట్టే అంశంలో ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే విజయుడు ఒకరిని ఒకరు తోసేసుకున్నారు.

ఇరు పార్టీల చెందిన కార్యకర్తలు ఒకరినొకరు తోసేసుకుంటూ అరుపులు , ఈలలు వేయడంతో గొడవకు దారి తీసే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఎంపీ మల్లురవి ఇరు పార్టీల కార్యకర్తలను సద్దుమణిగించే తోపులాట జరిగింది. ఎంపీ మల్లురవి తీరు పట్ల బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.అదే కోవలోనే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ,ఎమ్మెల్యే విజయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 అసలు వివాదం ఎక్కడ మొదలైంది .....

ప్రభుత్వం వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులను మంజూరు చేసింది. అందులో భాగంగా మంగళవారం ఎంపీ మల్లు రవి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే విజయుడు సిసి రోడ్ల భూమి నిర్మాణం కు శంకుస్థాపన పనులకు సంబంధించి టెంకాయలు కొట్టే అంశంలో వివాదం తలెత్తింది. తమ నాయకుడు ముందు కొట్టాలని కాంగ్రెస్ లేదు మా ఎమ్మెల్యే ముందు కొట్టాలని టిఆర్‌ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.