1 July, 2026 | 11:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

చెరువును తలపిస్తున్న రహదారి

21-10-2025 10:17 PM

చెరువు అనుకునేరు... జిల్లాకు వెళ్లే రహదారి

రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు

గరిడేపల్లి (విజయక్రాంతి): ఏంటి ఇది చెరువు అలుగు పారుతుంది అనుకుంటున్నారా... కాదు కాదు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే... ఇది సూర్యాపేట గరిడేపల్లి మిర్యాలగూడ ప్రధాన రహదారి... గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం వద్ద సూర్యాపేట గరిడేపల్లి మిర్యాలగూడ ప్రధాన రహదారి మీద చిన్నపాటి వర్షానికే తరచూ ఇలా చెరువు అలుగు పారినట్లుగా మొత్తం నీళ్లతో నిండిపోతుంది. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ గుంట ఉందో ఎక్కడ పడతామో ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా రోడ్డు దాటుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా మారిందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా రోడ్డు మీద నీళ్లు నిలిచి రోడ్డు దెబ్బ తినే లోపే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.