23 June, 2026 | 8:04 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

సొనాల బంద్ సంపూర్ణం

31-10-2025 01:20 AM

బోథ్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతులను అరెస్టు చేసినందుకు నిరసనగా గురువా రం చేపట్టిన సొనాల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే వ్యాపార వాణిజ్య సముదాయాలను యజమానులు మూసేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సొనాల లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ధర్నా చేయగా 13 మంది రైతులను అరెస్టు చేసిన విషయం విధితమే. దీనికి నిరసనగా బంద్ చేపట్టారు. కాగా ఈ బంద్ కు  బీఆర్‌ఎస్ నాయకులు పూర్తి మద్దతు పలికి రైతులకు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లా డుతూ... సోనాల బంద్  పిలుపు ఇవ్వగానే సంపూర్ణ బంద్ పాటించిన వ్యాపార యజమానులకు, ఆటో కార్మికులకు, కృతజ్ఞతలు తెలిపా రు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. బోథ్, సోనాల రైతులకు, యజమానులకు ఎటువంటి  సమస్య వచ్చినా మీ వెంటే  ఉంటామని ఎవరు అధర్య  పడద్దని, ఈ బంద్  వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలన్నారు.

రైతులకు అండగా నిలిచిన బిఆర్‌ఎస్  నాయకులపై, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం హేమమైన చర్యని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై  ప్రేమ ఉంటే సోనాల మండల కేంద్రంలో  వెంటనే సోయా, మక్కల కొనుగోలు ప్రారంభించాలని, రైతులపై ఉన్న  కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతుల పాల్గొన్నారు.