calender_icon.png 29 January, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న ముష్టిగింజల వాహనం సీజ్

29-01-2026 12:17:34 AM

ముగ్గురిపై కేసు నమోదు

ఆళ్ళపల్లి, జనవరి28, (విజయ క్రాంతి)  : రేగళ్ల రేంజ్ పరిధిలోని మర్కోడు నుండి అక్రమంగా తరలిస్తున్న ముష్టిగింజల బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేయడం జరిగింది, బారి మొత్తంలో సుమారు 1150 kg ల ముష్టిగింజలను ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారనే  పక్కా సమాచారం తో రేగళ్ల రేంజ్ సిబ్బంది అట్టి వాహనాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది,

అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ ఈ సందర్భంగా రేగళ్ల రేంజ్ అధికారి జస్వంత్ ప్రసాద్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆటవి ఉత్పత్తులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  రేగళ్ల రేంజ్ ఎఫ్ బి వో లు  నారాయణ సింగ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు