2 September, 2026 | 9:36 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల విషయంలో అలసత్వం తగదు

05-07-2025 | 12:00am

వొడితల ప్రణవ్

హుజురాబాద్,జూలై4: (విజయ క్రాంతి) సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలస్యం చేయడం నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ప్రణయ్ బాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లా హు జరాబాద్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ.ఎమ్మెల్యేకు ప్రభుత్వం పై కోపం ఉంటే ప్రజలపై చూపించడం తగదని, నెలలుగా చెక్కులు రివాలిడేషన్ పేరు తో తిరిగి పంపించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ హయాంలో విడుదలైన చెక్కులను సీఎం ఫొటో తీసేసి పంపిణీ చేయడాన్ని రాజకీయం చేస్తున్నార ని మండిపడ్డారు.చెక్కులు పంచడానికి కూ డా సమయం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు, ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి ప్ర జా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. సో షల్ మీడియాలో ప్రచారం చేయడానికే కా దు, ప్రజల సంక్షేమాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనిఅన్నారు.