17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జిల్లాలో కళాకారులకు కొదువలేదు

19-11-2025 12:05 AM
  1. యువజన ఉత్సవాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నవంబర్ ౧8 (విజయక్రాంతి): యువజన ఉత్సవాలలో జిల్లాలు ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జాతీయ యువజన ఉత్సవాల సం దర్భంగా జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లా స్థాయిలో యువజన కళాకారులు తమలోని కళా నైపుణ్యాన్ని, ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియ పరచడం కొరకు ఇలాంటి వేదిక లు ఎంతో ఉపయోగపడతాయని, జిల్లా స్థాయిలో ఎంపికైన కళాకారులు రాష్ట్ర స్థాయి లో, ఆ తర్వాత జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

జిల్లాలో కళాకారులకు కొదువలేదని, జిల్లా యంత్రాంగం కళాకారులను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, యువజన సంఘాల ప్రతినిధులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.