3 July, 2026 | 11:58 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

అచ్చంపేటలో పోటీ చేసేదేం లేదు

08-09-2025 01:45 AM
  1. అందరినీ సమన్వయపరిచి గ్రామ గ్రామాన 

గులాబీ జెండా ఎగిరేయడమే నా పని

నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

అచ్చంపేట సెప్టెంబర్ 7: అచ్చంపేటలో తనకు ఎలాంటి ఆశ లేదని పోటీ చేసే ఉద్దేశమే లేదని కేవలం గ్రామ గ్రామాన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేలా అందరిని సమన్వయ పరచడమే తన ముందున్న లక్ష్యమని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.

ఆదివారం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు హాజరై ప్రసంగించారు. నియోజకవర్గంలో ఎవరికి భయపడాల్సిన పనిలేదని ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలనిసూచించారు.