17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

తెలంగాణ సంప్రదాయాలను మంటగలిపారు

15-05-2025 01:23 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): 72వ మిస్ వరల్డ్ పోటీల పేరుతో తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికతను పక్కన పెట్టడం సరైనది కాదని పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. బుధవారం బీజేపి రాష్ర్ట కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. మిస్ వరల్డ్ వంటి పోటీలు తెలంగాణ సంప్రదాయాలను మంటగలపడమే కాకుండా, విదేశీ విచ్చలవిడి సంస్కృతిని ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు.

గతంలో ఈ- కార్ ఫార్ములా రేసింగ్‌ను వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో ఈవెంట్లు చే యడం వెనుక మతలబేంటని నిలదీ శారు. రాష్ర్టంలో ఓవైపు అన్నదాతలు కన్నీళ్లు పెడుతుంటే.. అందాల పోటీకి కోట్లు కుమ్మరించడమేంటన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేరు కానీ, మిస్ వరల్డ్ అందాల పోటీల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.