14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

ఇది ప్రజా విజయం..

13-12-2025 12:46 AM

సర్పంచ్ ఆనంద్ నాయక్

తాండూరు, డిసెంబర్ 12  (విజయక్రాంతి) : నా విజయం ప్రజా విజయమని.. ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన తండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఓటర్ మహాశయులకు నా విజయాన్ని అంకితం  చేస్తున్నానని... వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కందనెల్లి తండా సర్పంచ్ గా విజయం సాధించిన రాథోడ్ ఆనంద్ నాయక్ అన్నారు.

ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి గ్రామానికి సేవలు అందించేందుకు నిరీక్షించానని..గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన కూడా వెన్ను చూపకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా క్షేత్రంలో ఉన్నానని అన్నారు. తన ఈ విజయానికి సహకరించిన తాండ ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరు, వీధిదీపాలు, మురుగు కాలువలు పారిశుద్ధ్యం పనులు మరియు గ్రామాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో పేదలకు అందేలా చూస్తానని అన్నారు.