30-09-2025 02:16:47 AM
అందజేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): బ్రైడల్ జ్యువెలరీలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్గా గుర్తింపు పొందిన మానేపల్లి జ్యువెలర్స్ టైమ్స్ బిజినెస్ అవార్డును అందుకున్నది. ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా నిర్వాహకులు అందుకున్నారు. “మా ప్రయాణంలో మరో మైలురాయిని పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము.
బ్రైడల్ జ్యువెలరీలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్గా గౌరవించబడటంతో పాటు, మానేపల్లి జ్యువెలర్స్ టైమ్స్ బిజినెస్ అవార్డ్స్లో అత్యంత విశ్వసనీయ డైమండ్ స్టోర్గా కూడా గుర్తింపు పొందింది. ఈ డబుల్ గౌరవం మా ప్రియమైన కస్టమర్లు మాపై ఉంచిన విశ్వాసానికి మరియు ప్రతిరోజూ శ్రేష్ఠతను అందించడానికి కృషి చేసే మా ప్రతిభావంతులైన బృందం యొక్క అంకితభావానికి నిజమైన నిదర్శనం” అని నిర్వాహకులు అన్నారు.