16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

నేటితో వందేమాతరానికి 150 ఏళ్లు

07-11-2025 12:00 AM

రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : వందేమాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించి నేటికి 150 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన చేయనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన చేపట్టాలని సూచించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో నిర్వహించాలని ఆదేశిం చింది.

వందేమాతరం గీతాన్ని 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అయితే ఆయన వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వందేమాతరం సామూహిక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.