14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

భూపాలపల్లి నియోజక వర్గంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు

18-10-2025 07:37 PM

పాండవుల గుట్టలకు ప్రపంచ స్థాయి పర్యాటకులను తీసుకురావచ్చు

పురాతన కట్టడాలు పరిరక్షణకు కృషి

రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు కూతాడి అర్జునరావు

రేగొండ,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని రాష్ర్ట పురావస్తు శాఖ సంచాలకులు కూతాడి అర్జునరావు అన్నారు. మండలంలోని పాండవుల గుట్టలు, బగులోని గుట్టలు, మండల కేంద్రంలోని పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి సంచాలకులు అర్జునరావు సందర్శించారు. ఈ సందర్భంగా పాండవుల గుట్టలో ట్రెక్కింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ సహజ రాతి ఆకృతులు, పురాతన చిత్రాలు, ప్రకృతి పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.

పాండవుల గుట్టాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అభివృద్ది చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అన్నారు. మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నియోజక వర్గంలో కోటంచ, నాపాక, బుగులోని వేంకటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ది అద్భుతంగా జరుగుతుందని అభినందించారు. సందర్శించిన వారిలో ఉప సంచాలకులు నాగరాజు, సాయికిరణ్, కాంగ్రెస్ రేగొండ టౌన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తదితరులు అన్నారు.