2 July, 2026 | 12:21 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

జాతీయ అవార్డు కోసం అధికారులకు శిక్షణ

19-07-2025 12:00 AM

 శిక్షణ తరగతిలో ఎంపీడీవో సత్తయ్య           

కొండాపురం, జూలై 18:  గ్రామ పంచాయతీల జాతీయ అవార్డుల కోసం కార్యదర్శులతో పాటు అన్ని శాఖల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కొండాపూర్ మండల అభివృద్ధి అధికారి సత్తయ్య తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండలం పరిషత్ సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో సత్తయ్య  మాట్లాడుతూ జాతీయ అవార్డుల కోసం అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి అంశాన్నిఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. గ్రామపంచాయతీ చేపట్టిన వివిధ పనులను ఆధారంగా జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులకు ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు.

గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రతి శాఖ నుండి ఒక గ్రామ పంచాయతీ సాధించిన లక్ష్యాలను వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిస్తే వాటి ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారని, గ్రేడింగ్ ఆధారంగా జాతీయ గ్రామపంచాయతీ అవార్డులకు ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో వీరప్ప, ఏపిఎం సరిత, ఆర్ డబ్ల్యూఎస్ అధికారి రవికుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్యామల, విమల,  మెడికల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.