17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చేపల పెంపకం ద్వారా గిరిజనులు ఆర్థికంగా ఎదగాలి

26-11-2025 12:00 AM

ఎంపిడిఓ బద్రు నాయక్

మంగపేట నవంబర్ 25(విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పెంపకం ద్వారా ఆదివాసీ గిరిజనులు ఆర్థికంగా ఎదగాలని ఎంపీడీఓ భద్రునాయక్ అన్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీ లలోని 73 చెరువులకు గాను 16 లక్షల 53 వెల ఉచిత చేప పిల్లలను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెస మొబిలైజర్లకు గిరిజన మత్స్య సంఘాల అధ్యక్షులకు పంపిణి చేయడం జరిగిందన్నారు.

ఇందులో మూడు రకాల చేప పిల్లలు బొచ్చ రవ్వ బంగారు తీగ లాంటి రకాలను 16 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఐటిడిఏ పెస జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ మత్స్య శాఖ క్షేత్ర అధికారి రమేష్ సిబ్బంది మౌనిక నిహారిక పంచాయతీ కార్యదర్శులు రాజేష్  పెస మొబిలైజర్లు జోగ నరేంద్ర తాటి విజయ్ పోదేం నాగేశ్వరావు సాలం బాబు సుమలత 25 గ్రామ పంచాయతీ ల మొబిలైజర్లు పాల్గొన్నారు.