15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహాలక్ష్మి పథకం అమలు ఎక్కడ?

26-11-2025 12:00 AM

స్థానిక ఓట్ల కోసమే పథకాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:25 సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీరహిత రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.బతుకమ్మ పండగ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం కోటి 30 వేల మహిళలకు చీరలు ఇచ్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే చీరలు ఇస్తోందని విమర్శించారు.

సిద్దిపేటలో 3.83 లక్షల మహిళల్లో 1.99 లక్షల మందికే చీరలు అందించడాన్ని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 వాగ్దానం నెరవేరలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళా సంఘాలు తీసుకునే 25 వేల కోట్లలో 5 వేల కోట్లకే వడ్డీరహిత రుణం ఇస్తున్న ప్రభుత్వం 20 పైసలు ఇచ్చి 80 పైసలు ఎగబెడుతోంది అని అన్నారు. స్త్రీనిధికి వడ్డీరహిత రుణాలు నిలిపివేయడాన్నీ తప్పుపట్టారు. ఆర్టీసీ బస్సులు,1000 మెగావాట్ల సోలార్ పవర్ హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.

కేసీఆర్ పండుగకు పథకాలు ఇస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లకోసం పథకాలు ఇస్తున్నారు అని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ,ఎక్కడైనా పండుగ వాతావరణం నెలకొందంటె అది మహిళలతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగిందని,ఇప్పుడు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, అడిషనల్ డిఆర్డిఓ, ఫాక్స్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.