27-01-2026 01:26:29 AM
ప్రధమ వర్ధంతిలో పాల్గొన్న మాజీ స్పీకర్, మాజీ ఎంపీ తదితరులు
హైదరాబాద్, జనవరి 26: బీఆర్ఎస్ సీనియర్ నేత,వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం మాతృమూర్తి వెంకటలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. మాజీ స్పీకర్,శాసనమండల ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి,సీనియర్ నాయకులు ముద్దసాని సహోదర రెడ్డి తదితరులు పాల్గొని వెంకలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.