05-12-2025 12:11:10 AM
కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్, దివంగత కె. రోశయ్య వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ లో డి వై ఎస్ ఓ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్లు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎం చక్రధర్, కార్యదర్శి సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.