05-12-2025 02:05:27 AM
వేములవాడ,డిసెంబర్ 4,(విజయక్రాంతి):వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం గణేష్ తాతయ్య అయిన ఖమ్మం వెంకటయ్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖమ్మం వెంకటయ్య భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఖమ్మం వెంకటయ్య అంతిమ యాత్రలో పాల్గొని, కుటుంబానికి ధైర్యాన్ని కల్పించారు.