05-12-2025 12:12:13 AM
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండల ఆర్యవైశ్య ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సిద్ధి శ్రీధర్గుప్తాని స్థానిక మాజీ ఎమ్మె ల్యే జాజాల సురేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ప్రజాసేవలో ముందుంటారని వారు ఎల్లప్పుడూ దానధర్మాల్లో వెనకడుగు వేయరని అలాగే వ్యాపార పరంగా ఆర్యవైశ్యులు చాలా ముందంజలో ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అలాగే నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సిద్ది శ్రీధర్ గుప్తా ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఉన్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు రాచకొండ రవీందర్ రాచకొండ హరిబాబు స్వామి ఆదిమూలం సతీష్ కుమార్ ఇమ్రాన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.