12 March, 2026 | 10:47 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

హిడ్మాకు నివాళి.. ఇద్దరిపై కేసు

23-11-2025 12:31 AM

ఫ్లెక్సీని ఏర్పాటు చేసినందుకు పోలీసుల చర్యలు

వరంగల్ (మహబూబాబాద్), నవంబర్ 22 (విజయక్రాంతి): మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఫ్లెక్సీని గ్రామంలో ఏర్పాటు చేసి, నివాళులర్పించినందుకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా వేలే రు మండలం షోడశపల్లి గ్రామంలో హిడ్మా ఫ్లెక్సీ ఏర్పా టు చే యడం నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతు పలికినట్లేనని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పా ల్పడ్డ గ్రామానికి చెందిన కొయ్యడ సురేష్, మేక బుచ్చయ్యలపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.