calender_icon.png 24 June, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కు ఘనంగా నివాళులు

23-06-2025 09:15:05 PM

చండూరు (విజయక్రాంతి): జనసంఘ్ వ్యవస్థాపకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ(Former Union Minister Dr. Shyama Prasad Mukherjee) బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ... ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదని కాశ్మీర్ పూర్తిగా భారత్ చెందాలని, అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఆయన స్ఫూర్తితో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ కి స్వేచ్ఛ నిచ్చారన్నారు. అనంతరం స్థానిక బస్టాండ్ మరియు రెవిన్యూ డివిజన్ కార్యాలయం దగ్గర మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, సముద్రాల వెంకన్న, అన్నెపర్తి యాదగిరి, రావిరాల శ్రీను, ఇరిగి ఆంజనేయులు, సామ వెంకట్ రెడ్డి, ఉద్యమ నాయకులు కళ్ళెం సురేందర్ రెడ్డి, మున్సిపల్ పార్టీ ఉపాధ్యక్షులు కోమటి ఓంకారం, పులకరం నాగరాజు, పల్లెగోని చంద్రమౌళి, బూత్ అధ్యక్షులు చిట్టిప్రోలు వెంకటేశం, కారింగు రాజు, అనిమళ్ళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.