17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విద్యార్థినిలకు ఉచిత సైకిళ్లు

11-11-2025 09:55 PM

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు బుధవారం ఉచిత సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడు నీలం శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలోని 44 మంది విద్యార్థినిలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్‌ మొయినాబాద్, సికింద్రాబాద్‌ లేడిస్‌ సర్కిల్‌ 17, టిబ్రివాలా ఎలక్ట్రానిక్స్‌  స్వంచ్చంద సంస్థల సహాకారంతో పాఠశాలలో చదువుతున్న 44 మంది విద్యార్థినిలందరికీ ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.