16 April, 2026 | 9:02 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని

11-11-2025 10:06 PM

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నోముల వీరభద్రయ్య కుమార్తె నోముల షైనీ ఇటీవల జిల్లా కేంద్రం సూర్యాపేటలోని ఎస్వీ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్జీఎఫ్ క్రీడల విభాగం అండర్-14 అథ్లెటిక్స్ విభాగం (హైజంప్)లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం, మండల విద్యాధికారి బాలునాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 14, 15, 16 తేదీలలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ నందు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల పీడీ లోడంగి సైదులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.