26-08-2025 02:11:28 AM
ఈడీ దాడుల అనంతరం గోడ దూకి పారిపోయేందుకు యత్నించిన ఎమ్మెల్యే
కోల్కతా, ఆగస్టు 25: తృణమూల్ కాం గ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు చేశారు. ఉపాధ్యాయ కుంభకో ణం కేసులో ఈడీ ఈ దాడులు చేసింది. ఈ డీ దాడుల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే మొ దటి అంతస్తు గోడ దూకి పారిపోయేందుకు యత్నించారు. అతడిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 30 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఎమ్మెల్యే ఇంటితో సహా ఆయనకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడు లు చేశారు. శనివారం ఎమ్మె ల్యేను కోర్టులో తిరిగి హాజరుపర్చనున్నారు.