10-12-2025 07:11:55 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ లో పరిధిలో ఒకటే వార్డు చేస్తున్నందున రెండు వార్డులుగా విభజించాలని కోరుతూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తు ఇవ్వడంలో డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్, పోచారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ననావత్ రెడ్యా నాయక్, బద్దం జగన్మోహన్ రెడ్డి, నర్రి కాశయ్య, అక్రమ్ అలీ, మోటుపల్లి శ్రీనివాస్, నజీర్ ఖాన్ పాల్గొనడం జరిగింది.